ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా కోడెల ఖరారు?

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌ పదవి కోసం తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొని వుంది. తెలుగుదేశం సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్, ధూళిపాళ్ళ నరేంద్ర ఈ పదవి కోసం పోటీపడ్డారు. చివరికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కావడంతోపాటు, ఎంతోకాలం మంత్రిగా పనిచేసి, ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నినైన మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ పేరును ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో ఆయన పేరు మీద టీడీఎల్పీ సిబ్బంది నామినేషన్ పత్రాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.