సన్నిహితులతో కోడెల చివరి మాటలు !!

 

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కోడెల ఇక లేరన్న వార్త తెలుసుకున్న ఆయన అనుచరులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కోడెల తన ఆత్మ హత్యకు ముందు తన సన్నిహితులతో కొన్ని విషయాలు తెలిపి తీవ్ర ఆవేదనకు గురయ్యారని తెలుస్తోంది. ఏపీలో ఏర్పడ్డ జగన్ ప్రభుత్వం తన పై రాజకీయంగా కక్షగట్టి కేసుల పేరుతో వేధిస్తోందని అన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు పేరుతో ప్రతీకార రాజకీయాలు చేస్తోందని తన పై కక్షగట్టి క్షోభకు గురి చేస్తోందని, తలవంపులు తెచ్చి మానసిక చిత్రవధ చేయాలన్నది  ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంతకూ ముందు కూడా అధికారం చేతులు మారడం చూశాం కానీ ఇలా వెంటాడి, వేధించి చంపేయాలన్నకసితో టార్గెట్‌ చేయడం ఇప్పుడే చూస్తున్నాం. 35 ఏళ్లలో కలలో కూడా ఇలాంటి పరిస్థితి ఊహించలేదు అని కోడెల ఆవేదన చెందినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.