హెరిటేజ్ ని టార్గెట్ చేసిన కోదండరాం
posted on Sep 12, 2013 3:44PM
హెరిటేజ్తో తమ పాల వ్యాపారుల పొట్టకొట్టారని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. నగరంలో 10 శాతం ఉన్న వారే హైదరాబాద్ తమది అంటే, 90 శాతం ఉన్న తాము ఏమనాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడితే గుప్పెడు మంది దోపిడీదార్లకే నష్టమని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని ప్రతీ బస్తీ బంజారా హిల్స్ కావాలని ఆకాంక్షించారు. కేవలం సినిమాలు, మీడియానే కాకుండా వ్యవస్థలన్నీ సీమాంధ్రుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. చివరకు పాఠ్యపుస్తకాన్ని కూడా ఎవరు రాయాలో సీమాంధ్రులే నిర్ణయిస్తారన్నారు. అన్ని రంగాలలో సీమాంధ్రులే ఉంటే తెలంగాణ ప్రాంత సమస్యలు ఎలా అర్థమవుతాయి, ఎలా తీరుతాయని ప్రశ్నించారు.