బోర్ కొట్టి థ్రిల్ కోసం కత్తితో దాడి..

 

రోజు రోజుకి మనుషులు ఎలా తయారవుతున్నారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న చెన్నైకి చెందిన ఓ మెడికో కుక్కని టెర్రస్ పై నుండి వదిలి తన పైశాచికాన్ని చూపించాడు. ఇప్పుడు కేవలం తన థ్రిల్ కోసమే ఓ వ్యక్తి అందరిపై కత్తితో దాడి చేస్తూ అందరిని భయపెడుతున్నాడు. ఈ భయంకరమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. 31 ఏళ్ల జంగ్ అనే వ్యక్తికి రాత్రి సమయంలో ఒంటరిగా రోడ్డుపై నడుకుంటూ వెళ్లే వాళ్లమీద పదునైన కత్తితో దాడి చేస్తుంటాడు. మోటర్ సైకిల్ పై వేగంగా వచ్చి పదునైన కత్తితో నిందితుడు దాడి చేసి పారిపోయేవాడు. అలా ఓ మహిళపై దాడి చేయగా.. కత్తి పన్నెండున్నర ఇంచెల లోపలికి చొచ్చుకుపోయి.. ఆమె వీపుకు ఏకంగా 32 కుట్లు పడ్డాయి. ఇంకా పలువురు పై జంగ్ దాడి చేశాడు. అయితే స్థానికులు ఈ ఫోటోలను తీసి ఇంటర్నెట్‌లో పెట్టడంతో ఇది వెలుగు చూసింది. దీంతో సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేసి జంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను చెప్పిన సమాధానం విని పోలీసులే అవాక్కయ్యారు. కేవలం కేవలం బోర్ కొట్టడంతో.. థ్రిల్ కోసం ఇలా చేశానని చెప్పాడు. ఇది విన్న నెటిజన్లు అతడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.