కేసీఆర్‌పై షీ టీమ్‌ కేసు పెట్టాలి!!

 

తెలంగాణ కేబినెట్ విస్తరణలో మహిళలకు చోటు దక్కని విషయం తెలిసిందే. గత కేబినెట్ లో మహిళలకు అవకాశం ఇవ్వని సీఎం కేసీఆర్.. ఈసారైనా అవకాశమిస్తారని భావించారంతా. కానీ ఈసారి కూడా మహిళలకు చోటు దక్కలేదు. దీంతో ప్రతిపక్షాలు కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి.. కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ కూర్పను ఆయన తప్పుబట్టారు. కేబినెట్‌లో మహిళలు, గిరిజనులకు ప్రాధాన్యం లేదని విమర్శించారు. గతంలోనూ మహిళలకు కేబినేట్ లో స్థానం కల్పించలేదని ఈసారైనా కల్పిస్తారని ఆశిస్తే ఈసారి కూడా అవకాశం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలపై వివక్ష చూపుతున్నందుకు గానూ కేసీఆర్‌పై షీ టీమ్‌ కేసు పెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.