టీ బీజేపీ అధ్యక్షుడిగా మళ్ళీ కిషన్ రెడ్డి

 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి మరోసారి ఎంపికయ్యారు. మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో జరిగిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జగత్ ప్రకాష్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి స్పందిస్తూ, ‘‘హైదరాబాద్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి ఎయిమ్స్ మంజూరు చేయించిన ఘనత రాష్ట్ర బీజేపీకే దక్కుతుంది. ప్రధాని నరేంద్రమోడీ సహకారంతో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాను’’ అన్నారు.