వరస్ట్ సీఎం కూడా కిరణ్కుమార్ రెడ్డి
posted on Dec 21, 2013 2:53PM
దేశంలోనే వరస్ట్ సీఎం కిరణ్కుమార్ రెడ్డి అని, రాష్ట్ర విభజన విషయంలో కిరణ్ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ కంటే ఎక్కువ ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కిరణ్ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు రాకుండా సీఎం కిరణ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జనవరి 3 నుంచి జరిగే సమావేశాల్లో బిల్లుపై చర్చ జరగకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనంపై ప్రజలకు కేసీఆర్ స్పష్టత ఇవ్వాలన్నారు. పయ్యావుల సమైక్యవాదం ఆయన వ్యక్తిగతమని ఆయన అన్నారు. విభజనపై చంద్రబాబు స్పష్టతతో ఉన్నారని ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.