ఇక్కడే పుట్టాం..కలిసుందాం: కిరణ్

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైద్రాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సమైక్యవాణి విన్పించారు. ‘ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి..’అందుకే తాము కలిసి ఉండాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.తాము ఎందుకు కలిసి ఉండాలని కోరుకుంటున్నామో గీతా రెడ్డి వంటివాళ్లు అర్థం చేసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మాటలకు గీతారెడ్డితో పాటు తదితరులు నవ్వుకున్నారు.శ్రీసిటిలో ఆయన శనివారం పెప్సికో బేవరేజ్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. విభజన.. సమైక్య ఉద్యమాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుంటు పడలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పడం కొసమెరుపు.