చంద్రబాబు డైరెక్షన్‌లో కాంగ్రెస్‌లోకి కిరణ్ రీఎంట్రీ..!!

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తిరిగి కాంగ్రెస్ గూటికి చేరటంతో ఏపీ కాంగ్రెస్ లో నూతనోత్సాహం వచ్చింది.. ఇదే ఉత్సాహంతో మిగతా సీనియర్ నాయకులని తిరిగి ఆహ్వానించాలని చూస్తోంది.. అలానే విభజన అనంతరం పార్టీని వీడిన మెజారిటీ కేడర్ వైసీపీలో చేరింది.. వారిని కూడా తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు కొత్తగా ఓ టాపిక్ తెరమీదకు వచ్చింది.. అదే, చంద్రబాబు డైరెక్షన్లో కిరణ్ కాంగ్రెస్ లో చేరారట.

 

 


తాజాగా గుంటూరులో బీజేపీ కార్యకర్తల సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు.. అసలే ప్రస్తుతం బీజేపీ,టీడీపీ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ సమావేశంలో కూడా బీజేపీ నేతలు బాబు మీద విమర్శలు, ఆరోపణలు చేసారు.. బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతు రమేష్ నాయుడు అయితే ఏకంగా కిరణ్ కాంగ్రెస్ లో చేరడం వెనక చంద్రబాబు ఉన్నారన్నారు.. చంద్రబాబు డైరెక్షన్లోనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ చేరారని ఆరోపించారు.