విభజన ప్రకటనలపై కిరణ్ ఆగ్రహం
posted on Oct 11, 2013 4:08PM
రాష్ట్ర విభజనపై హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటన పై పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కు ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభ్యంతరం చెప్పారని వార్తలు వచ్చాయి. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయం విషయంలో సుశీల్ కుమార్ షిండే ఒక మాట, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అయిన మీరు ఒక మాట చెబుతున్నారు. ఇద్దరూ వేర్వేరు ప్రకటనలు చేయడం ఏమీ బాగోలేదు. ఇది ప్రజలను ఆందోళన పరుస్తోంది. విభజనకు సంబంధించిన తీర్మానం రాష్ట్ర శాసన సభకు వస్తుందని మీరు చెప్పారు. ఇప్పుడు షిండే తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తుందని అంటున్నారు. మీరు చెప్పారని నేను ఏపీఎన్జీఓలకు నచ్చజెప్పాను. ఇప్పుడు ఇలా చేస్తే ఎలా” అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.