నరేంద్ర మోడీకే నా ఓటు: కిరణ్ బేడీ

 

 

 

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన మాజీ మద్దతుదారు కిరణ్ బేడీ షాకిచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర , సుపరిపాలన కావాలంటే మోడీకే తాను ఓటు వేస్తానని తేల్చిచెప్పారు. తనకు ప్రథమ ప్రాధాన్యం భారత్ అని, మంచి పాలన, మంచి యంత్రాంగం, నిజాయితీ, భాగస్వామ్య విధానం కారణంగా ఓ స్వతంత్ర ఓటరుగా తాను నరేంద్ర మోడీకి ఓటేస్తానని ఆమె ట్విట్టర్‌లో రాశారు. అన్నా శిష్యుడు అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో అన్నాకు సన్నిహితంగా ఆయనతో కలిసి ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న కిరణ్ బేడీ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో విలువలను మార్చిందని, ఇది దేశానికంతటికీ మంచిదని కిరణ్ బేడీ అన్నారు.