ఆ వార్తల్లో నిజం లేదు.. నేను ఇక్కడే ఉంటా...

 

ఏపీ గవర్నర్ గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీగా నియమిస్తారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఆమె స్పందించారు. తాను ఏపీకి గ‌వ‌ర్న‌ర్ కానున్న‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఏ మాత్రం నిజం లేద‌ని, అవ‌న్నీ నిరాధార‌మని ఆమె స్ప‌ష్టంచేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ గా తాను చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌కు మంచిపేరు వ‌స్తోంద‌ని, తాను  అక్క‌డే పూర్తికాలం కొన‌సాగుతాన‌ని ఆమె తేల్చిచెప్పారు. కాగా గత కొద్దికాలంగా ఉమ్మడి రాష్ట్రల గవర్నర్ గా ఉన్న నరసింహన్ పై ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే.. న‌ర‌సింహ‌న్ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏపీని ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న్ను తొల‌గించాల‌న్న డిమాండ్ తెరపైకి వచ్చింది.