ప్రొటెం స్పీకర్‌ విషయంలో సుప్రీంను అశ్రయించనున్న కాంగ్రెస్...

 

ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపయ్యను బీజేపీ నియమించిన సంగతి తెలిసిందే కదా. ఇక బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టిన సంగతి కూడా విదితమే. సీనియర్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరొకరిని నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబడుతోంది. ఎనిమిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దేశ్‌పాండేను కాదని బోపయ్యకు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అంతేకాదు దీనిపై కూడా కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. కాగా కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలో ఏర్పాటైన యడ్యూరప్ప ప్రభుత్వం శనివారమే బలనిరూపణ చేయాలని సుప్రీం ఆదేశించింది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.