ప్రొటెమ్ స్పీకర్ గా బోపయ్య... మండిపడుతున్న కాంగ్రెస్..

 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బలపరీక్షకు సుప్రీంకోర్టు రేపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బలపరీక్షలో స్పీకర్ కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో ప్రొటెమ్ స్పీకర్ తో బలపరీక్ష చేయించనున్నారు. ఇక ప్రొటెమ్ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజే బోపయ్యను ఎంపిక చేశారు. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ న్యాయ నిపుణులతో చర్చించి...ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.  కాసేపట్లో ప్రొటెం స్పీకర్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఎమ్మెల్యేల్లో అందరికంటే ఎక్కువ సీనియార్టీ ఉన్న తమ ఎమ్మెల్యే  దేశ్ పాండేను పక్కనపెట్టేసి బోపయ్యను ఎలా నియమిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో  బీజేపీ, గవర్నర్ మరిన్ని కొత్త తలనొప్పులు తెచ్చుకుంటున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.