లక్ష్మీ పార్వతికి కేతిరెడ్డి మరో సవాల్..

 

గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరోసారి తెరపైకి వచ్చాడు. ఇప్పటికే ఈ సినిమా విషయంలో లక్ష్మీ పార్వతికి, ఈయనకు వార్ నడుస్తుంది. ఇద్దరూ సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీ పార్వతీకి సవాల్ విసిరాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన...  ‘లక్ష్మీపార్వతిగారూ! చెప్పండి..ఎక్కడికి రమ్మంటారు? నువ్వు మాట్లాడిన మాటలకు నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసేందుకు సిద్ధమే. కానీ, అన్న ఎన్టీఆర్ గారి మీద ఉన్న ప్రేమ కారణంగా నేను ఆ పని చేయట్లేదు. మద్రాసు నుంచి తమిళులు, తెలుగు వాళ్లు నన్ను తరిమేశారని తప్పుడు వ్యాఖ్యలు చేస్తారా? తమిళ హాస్యనటుడు వడివేలును కొట్టడానికి వాళ్ల ఇంటిపైకి వెళ్లినవాడిని నేను! వడివేలే నన్ను ఏం చేయలేకపోయాడు’ అని అన్నారు. తెలుగు భాష కోసం నాటి సీఎం జయలలితనే ఎదిరించిన వాడిని.. తమిళ పేపర్లలో జయలలితపై స్టేట్ మెంట్లు ఇచ్చిన వాడిని అని చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై లక్ష్మీ పార్వతి ఎలా స్పందిస్తుందో చూద్దాం..