కేశినేని మరో ట్వీట్ రచ్చ....దొంగకి ఊరంతా దొంగల్లాగే కనపడతారట !

 

ఎవరెన్ని చెబుతున్నా టీడీపీ ఎంపీ కేశినేని నాని మాత్రం ట్వీట్ల యుద్ధాన్ని ఆపలేదు. నానికి, బుద్దా వెంకన్నకు మధ్య నడుస్తున్న ట్వీట్ల యుద్ధాన్ని ఆపేయాలంటూ టీడీపీ అధిష్టానం సూచించి నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఏమయిందో ఏమో కానీ దీంతో అధిష్టానంపై గౌరవంతో తాను ట్వీట్ల యుద్ధాన్ని ఆపేస్తున్నానని ప్రకటించి బుద్దా వెంకన్న ఆ ట్వీట్లు ఆపేశారు. చివరగా ఫైనాన్షియర్లకు డబ్బులు ఎగ్గొట్టారంటూ బుద్దా వెంకన్న ఈ నెల 14న ట్వీట్ చేశారు. అదే రోజున చంద్రబాబు కోసం, పార్టీ కోసం ట్వీట్ల యుద్ధాన్ని ఆపేస్తున్నానంటూ బుద్దా వెంకన్న మళ్లీ ట్వీట్ చేయలేదు. 

కానీ నాని మాత్రం అప్పటి ట్వీట్లనే గుర్తు చేసుకుని మరీ రోజుకో ట్వీట్ చేస్తున్నారు. ఈరోజు కూడా ఆయన బుద్ధా వెంకన్నని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ''ప్రబుద్ధుడు చెప్పింది అక్షర సత్యం. ఫైనాన్షియర్లకి డబ్బులు ఎగ్గొట్టి వ్యాపారం చేసినా.. 88 ఏళ్ల కేశినేని ట్రావెల్స్ మూసుకునే పరిస్థితి వచ్చేది కాదు. ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదు. దొంగకి ఊరందరూ దొంగలుగానే కనపడతారు" అని కేశినేని నాని ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ లు ఆగాలంటే ఏమి చేయాలో ఏమో ?