ఆరో అంతస్తులోంచి దూకేశాడు

 

కేరళలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను పనిచేస్తున్న కార్యాలయం భవంతి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రివేండ్రం టెక్నోపార్క్ క్యాంపస్లో గల ఓ ఐటీ సంస్థలో పనిచేసే శ్రీరాజ్ శ్రీధరన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆరో అంతస్థు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్లుగా ఆ సంస్థలో పనిచేస్తున్న శ్రీరాజ్ చాలా బాగా పనిచేసేవాడని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. శ్రీరాజ్ శ్రీధరన్ ఆత్మహత్యకు కారణం పని వత్తిడేనని ఆయన సహచరులు భావిస్తున్నారు.