లిబియా నుంచి తిరిగొచ్చిన కేరళ నర్సులు...

 

ఇరాక్‌లో అంతర్యుద్ధం జరుగుతున్న సందర్భంగా 67 మంది కేరళ నర్సులు ఇటీవల కేరళలో ఇరుక్కుపోయారు. వారిని భారత ప్రభుత్వం క్షేమంగా ఇండియాకి తీసుకొచ్చింది. ఆ నర్సులు మొదట ఇరాక్‌లోనే వుండి వైద్య సేవలు చేయాలని భావించినప్పటికీ, అక్కడి పరిస్థితి విషమించడంతో వారందరూ ఇండియాకి వచ్చేశారు. తాజాగా అలాంటి పరిస్థితే లిబియాలో వున్న కేరళ నర్సులు కూడా ఎదుర్కొన్నారు. లిబియాలో అంతర్యుద్ధం కారణంగా 44 మంది కేరళ నర్సులు ఆ దేశంలో చిక్కుకుపోయారు. వారు గత పది రోజులుగా అక్కడ బిక్కుబిక్కుమంటూ వున్నారు. భారత ప్రభుత్వం చేసిన కృషి కారణంగా వారికి అక్కడి నుంచి విముక్తి లభించింది. లిబియాలో చిక్కుకుపోయిన 44 మంది నర్సులు మంగళవారం నాడు క్షేమంగా ఇండియాకి చేరుకున్నారు.