ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం

 

 

 

ఢిల్లీలో చీపురు కట్టతో చరిత్ర సృష్టించిన ఆమ్ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అరవింద్ కేజ్రీవాల్తో ప్రమాణ స్వీకారం చేయించారు. సమాచార హక్కు కార్యకర్త మనీష్ సిసోదియా, మిగిలిన ఐదుగురు మంత్రులతో కూడా నజీబ్ జంగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాంలీలా మైదాన్ ప్రజలు, అభిమానులతో కిక్కిరిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల మద్దతుతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఏర్పడడం విశేషం.