కాంగ్రెస్ తెలివి తక్కువ శత్రువు అంటున్న కేసీఆర్

 

తెలంగాణ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు ఈ మధ్య దానం నాగేందర్ రూపంలో ఒక షాక్ తగిలిన విషయం తెలిసిందే.. దానం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల విమర్శలు చేసి, సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.. ఈ సందర్బంగా మాట్లాడిన కేసీఆర్.. '82 అసెంబ్లీ స్థానాల్లో 60శాతానికి పైగా ప్రజలు తెరాస పక్షాన నిలుస్తున్నారని.. మరికొన్ని స్థానాల్లో 50 శాతం మద్దతు ఇస్తున్నారని తెలిపారు.. తెరాస అభ్యర్థులు 50 నుండి 60వేల మెజార్టీతో గెలుస్తారని' తాజా సర్వే గురించి చెప్పారు.. అలానే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన కేసీఆర్, 'కాంగ్రెస్ నేతలకు మాట్లాడే తెలివి లేదు.. అలాంటి తెలివి తక్కువ శత్రువు ఉండడం వల్ల మా వాళ్లు కూడా మొద్దుబారిపోతున్నారు' అంటూ కేసీఆర్ విమర్శించారు.. కేసీఆర్ మాటలు వినైనా కాంగ్రెస్ నేతలు వాళ్లలో వారు అంతర్గత కుమ్ములాటలకు పోకుండా, కేసీఆర్ మీద సమిష్టిగా పోరాడతారేమో చూద్దాం అని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.