టీఆర్ఎస్ వీలినంపై వివాదం
posted on Feb 26, 2014 11:27AM
గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో టీఆర్ఎస్ వీలినం పై జోరుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీలినం పై రాష్ట్ర టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు రావడంతో కొత్త వివాదానికి తెరలేచింది. కాంగ్రెస్ లో వీలినం పై టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియాలో వీలినంపై వస్తున్న వార్తలన్నీ కల్పితమేనని కొట్టిపారేశారు. పార్టీ వీలిన౦పై కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతలెవరు ఈ వార్తలను నమ్మవద్దని సూచించారు. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ మాత్రం వీలినంపై చర్చలు జరుగుతున్నాయని ప్రకటించడం విశేషం. కేసిఆర్ తో వీలిన౦పై ప్రాధమిక చర్చలు జరిగాయని, విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని అన్నారు. త్వరలో దీనిపై ఓ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.