కేసిఆర్ గ్రాండ్ ఇప్తార్ పార్టీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఈరోజు ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వనున్నారు. దీని కోసం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఇప్తార్ విందుకు రాజకీయ, ఇతర రంగాల చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. వీరి కోసం పోలీసులు భారీబందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసిఆర్ తో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పలువురుమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 6వేల మందికి పైగా ఈ ఇఫ్తార్ విందుకి హాజరవుతారని అంచనా వేస్తున్నారు.