తెలంగాణలో బ్రోకర్ ఎవరో తేలాలి
posted on Aug 16, 2013 4:30PM
టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ తనను బ్రోకర్ అనడంపై ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ మండిపడ్డారు. తాను బ్రోకర్ ను కానని, తెలంగాణలో బ్రోకర్లు ఎవరో అందరికీ తెలుసు అని టీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టారు. టీఆర్ఎస్ పై 10 అంశాలకు సంబంధించిన ఆరోపణలున్న కవర్ ను జేఏసీకి పంపిస్తున్నానని, ఈ అంశాలపై జేఏసీ విచారణ జరిపించాలని దిలీప్ కుమార్ కోరారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మధ్య బ్రోకర్ గా వ్యవహరించిందెవరు?ఒడిషాలో వ్యాపారిని కిడ్నాప్ చేసిందెవరు?సినిమా వాళ్ల దగ్గర వసూళ్లకు బ్రోకర్ గిరి చేసిందెవరు అంటూ పలు ప్రశ్నలను ఆయన సంధించారు. అయితే ఇటీవల టీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ లో చేరుతున్న నేతలకు మధ్య వర్తిత్వం వహిస్తున్నారని కెసిఆర్ అన్నట్లు వార్తలు వచ్చాయి.