చంద్రుల ఢిల్లీ టూర్

 

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  కేసీఆర్ (తెలంగాణ), చంద్రబాబు నాయుడు(ఆంధ్ర ప్రదేశ్) ఈరోజు ఢిల్లీలో విడివిడిగా వేరు వేరు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు. ఎర్రవల్లిలో రెండోరోజు యాగంలో పాల్గొని, హారతి పూర్తయిన తరువాత ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు రాత్రి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి హర్షవర్ధన్‌ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలుస్తారని సమాచారం. అనంతరం రాత్రికి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో హైకోర్టు ప్రారంభోత్సవానికి సీజేఐని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు. అలాగే రేపు జరిగే బీజేపీయేతర పక్షాల భేటీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.