జమ్మూకశ్మీర్‌లో భూప్రకంపనలు

మెక్సీకో భూకంపం ఇంకా కళ్ల ముందు కదులుతుండగానే..భారత్‌లోని జమ్మూకశ్మీర్ భూకంపానికి వణికిపోయింది. ఇవాళ ఉదయం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో కశ్మీర్‌లో సంభవించిన భూకంపానికి కశ్మీర్ ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. స్వల్ప భూకంపమే అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వరుసగా ఇవే సంఘటనలు జరుగుతుండటం ప్రజల భయానికి కారణమైంది.