కరుణానిధి చివరి సినిమా..!!

 

సినీరంగం నుండి రాజకీయాల్లోకి వచ్చిన వారు చాలామంది ఉంటారు.. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా సినిమాలను వదలని వారు చాలా అరుదుగా ఉంటారు.. అలాంటి వారిలో ఒకరు కరుణానిధి.. సీఎం అయ్యాక కూడా ఆయన సినిమాలకు దూరం అవ్వలేదు.. సీఎంగా పనిచేసిన ఆఖరి రోజు వరకు సినిమాతో ఆయన బంధం కొనసాగింది.. 2011లో ప్రశాంత్‌ హీరోగా వచ్చిన ‘పొన్నార్‌ శంకర్‌’ చిత్రానికి కరుణానిధి కథ అందించారు.. ఇదే ఆయన చివరి సినిమా.. రాజకుమారి సినిమాతో సినీ రచయితగా జీవితాన్ని ప్రారంభించిన కరుణానిధి రాజకీయాల్లోకి వచ్చినా, ఆఖరికి సీఎం అయినా కూడా సినిమాలు వదల్లేదు.. కరుణానిధికి సినిమా అంటే ఎంత ప్రేమో దీనిని బట్టి అర్థంచేసుకోవచ్చు.