కరుణానిధికి తోడుగా మరో ఇద్దరు
posted on Aug 8, 2018 4:14PM
కరుణానిధి మరణంతో విషాదంలో ఉన్న డీఎంకే శ్రేణులను మరింత విషాదంలోకి నెట్టే సంఘటన జరిగింది.. కరుణానిధి మరణవార్త విని, ఆయన పార్థివదేహాన్ని దర్శించుకోవడానికి తమిళనాడు నలుమూలల నుండి డీఎంకే శ్రేణులు భారీగా తరలి వచ్చారు.. ప్రజల సందర్శనార్ధం కరుణానిధి పార్థివదేహాన్ని రాజాజీ హాల్లో ఉంచారు.. కరుణకు నివాళులర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు రావడంతో సామాన్యులకు అవకాశం రాలేదు.. దీంతో కరుణను దగ్గర నుంచి చూడాలని అభిమానులు చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు.. కొందరు బారికేడ్లు దాటుకుని కరుణ పార్థివదేహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలోనే తోపులాట చోటుచేసుకుంది.. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు.. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 33 మంది వరకు గాయపడ్డారు.. రాజాజీ హాల్ సమీపంలో ఉన్న ప్రజలను పోలీసులు చెదరగొట్టారు.. హాల్ చుట్టూ భారీగా మోహరించి, సమీపంలోకి ఎవరూ రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.