యాడ్యురప్ప బేరసారాలు.. బయటపెట్టిన కాంగ్రెస్


ఇప్పటికే కర్ణాటకలో బలపరీక్షలో ఏం జరగుతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక బలపరీక్ష సమయం దగ్గర పడుతున్న కొద్ది కొత్త కొత్త ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా యడ్యూరప్ప కాంగ్రెస్ పార్టీ నేతలపై బేరాసారాలకు దిగిన ఆడియో టేపులు బయటపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఆడియో టేపులను బయటపెడుతోంది. ఆడియో టేపులో ఉందంటే..

యడ్యూరప్ప: ఎక్కడున్నారు?
పాటిల్: బస్సులో ఉన్నాం. కొచ్చికి వెళుతున్నాం.
యడ్యూరప్ప: కొచ్చికి వెళ్లకు. వెనక్కి వచ్చేయ్.
పాటిల్: నా పొజిషన్ ఏమిటో ముందు చెప్పండి.
యడ్యూరప్ప: యూ విల్ బికమ్ మినిస్టర్. కావాల్సినంత సాయం కూడా చేస్తాం.
పాటిల్: నాతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
యడ్యూరప్ప: వాళ్లను కూడా పిలుచుకుని రా. ఇంకా ఏమైనా కావాలంటే శ్రీరాములుతో మాట్లాడతా.
పాటిల్: అలాగే అన్నా.
యడ్యూరప్ప: ఏం చేయాలనుకుంటున్నావు?
పాటిల్:  మీరు చెప్పినట్టే చేద్దాం. ఐదు నిమిషాల్లో మళ్లీ ఫోన్ చేస్తా.