అజ్ఞాతం వీడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే...కాంగ్రెస్ కు రిలీఫ్


దేశం మొత్తం ఇప్పుడు కర్ణటాకలో ఏం జరుగుతుందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో దేశం అంతా కర్ణాటక వైపే చూస్తోంది. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. అసెంబ్లీకి వచ్చారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ పార్టీకే ఓటు వేయాలని చెప్పారు. దీంతో, ఆనంద్ సింగ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారనే విషయం స్పష్టమైంది. గత రెండు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ కూడా సొంత పార్టీకే మద్దతు ఇస్తానని చెప్పినట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ కు ఒక టెన్షన్ తగ్గినట్టైంది. మరి ఆఖరికి ఎవరు గెలుస్తారన్నది తెలియాలంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే.