కర్ణాటకలో ప్రతిపక్షం ఎవరికి?
posted on May 8, 2013 7:48PM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దాదాపు ధ్రువపడినట్లే! దాదాపుగా 120 సీట్లతో ఇక్కడ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే రెండోస్థానంలో నిలిచే పార్టీ ఏది అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎనిమిదేళ్ల తర్వాత కర్ణాటకలో అధికారం సాధించిన ఉత్సాహంలో కాంగ్రెస్ ఉండగా, రెండోస్థానం కోసం బీజేపీ, జేడీఎస్ లు పోరాడుతున్నాయి. ప్రస్తుత ఆధిక్యాల దృష్ట్యా రెండు పార్టీలూ చెరో 40 సీట్లనూ సాధించే అవకాశం కనిపిస్తున్నాయి. 120 కాంగ్రెస్ ఖాతాలో అనుకున్నా, చెరో 40 సీట్లతో మిగతా రెండు పార్టీలూ బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో… ఒకటీ రెండు సీట్లతో బీజేపీ, జేడీఎస్ లలో ఎవరో ఒకరు ఆధిక్యంలో నిలిచే అవకాశాలున్నాయి. ఫలితాల గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) (జనతా దళ్ సెక్యులర్) పార్టీ అధ్యక్షుడు హెచ్డి కుమారస్వామి మాట్లాడుతూ…తాను కింగ్ ను కాను… కింగ్ మేకర్ ను కాదు అని అన్నారు. తాము ఎటువంటి రేసులో లేమని ఆయన స్పష్టం చేశారు. తమకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించలేదని కుమారస్వామి అన్నారు. ప్రతిపక్షంలో కూర్చుని.. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. జేడీఎస్ నాలుగు స్థానాల్లో గెలుపొంది, మరో 37 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది.