బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. వాళ్లు బాబ్రీ మసీదును నిర్మిస్తారు..


త్వరలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే రెండు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పిస్తారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నేత, ఉత్తర కర్ణాటకలోని బెళగావి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, మనది హిందూదేశమని, తమ పార్టీని గెలిపిస్తే రామ మందిరం నిర్మిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన లక్ష్మి హెబ్బాలికర్ రామ మందిరం నిర్మిస్తామని హామీ ఇస్తారు కానీ, ఆ పార్టీని గెలిపిస్తే వారు తప్పకుండా బాబ్రీ మసీదును నిర్మిస్తారని వ్యాఖ్యానించారు. మసీదు కోరుకునేవారే కాంగ్రెస్‌కు ఓటేయాలని అన్నారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.