కిర్లంపూడిలో టెన్షన్.. ముద్రగడ హౌస్ అరెస్ట్..

 

కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకు ముందు ఉద్యమం చేస్తానన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ముద్రగడను హౌస్ అరెస్ట్ చేయగా ఇప్పుడు మరోసారి ఆయనను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలోనే ఆయనను హౌస్ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఆయన తన ఇంటి నుంచి బయటకు రాగానే ఆయన కారును అడ్డుకుని వెనక్కి పంపేసి, ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. అలాగే కాపు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఉద్యమ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారిని ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నామని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు.  కాగా రేపటి నుండి ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కిర్లంపూడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.