హీరోయిన్ మైత్రేయ కేసు.. వాస్తు దోష ప్రభావమా?

 

అడ్డమైన చెత్త పనులు చేయడం... దానికి కారణం వాస్తు అని నేరమంతా వాస్తు నెత్తిన వేయడం ఈమధ్యకాలంలో రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. బాగా నడిచినంతకాలం అంతా తమ ప్రతిభ అని బిల్డప్పు ఇవ్వడం, ఏదైనా తేడా వస్తే వాస్తు ప్రాబ్లం వల్లే తనకు కష్టాలు వచ్చాయని వాపోవడం మామూలైపోయింది. ఇప్పుడు ఇలా వాపోయే రాజకీయ నాయకుల లిస్టులోకి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ కూడా చేరారు. ఈమధ్య ఈయనగారి పుత్రరత్నం కార్తీక్ గౌడ సినీ హీరోయిన్ పెట్టిన మోసం, రేప్‌లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆ కేసు పుణ్యమా అని పోలీసులు కార్తీక గౌడను జైల్లో వేసేవారే.. ఎక్కడో అదృష్టం బేలన్స్ వుండి బెయిల్ వచ్చింది. ఇదిలా వుంటే, రాజకీయంగా ఉన్నత స్థాయిలో దూసుకుపోతూ కేంద్ర రైల్వే మంత్రి పదవి కూడా చేపట్టిన తనకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రావడానికి ఢిల్లీలోని తన ఇంటి వాస్తు బాగాలేకపోవడమేనని సదానందగౌడ భావిస్తున్నారట. జనం సొమ్ము అర్జెంటుగా ఖర్చు చేసి ఆ ఇంటికి వాస్తు రిపేర్లు చేయాలని ఆలోచిస్తున్నారట. రిపేర్ చేయాల్సింది ఇంటికి కాదు.. బుద్ధికి అనే విషయం మంత్రిగారు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో..!