హీరోయిన్ మైత్రేయ కేసు: మంత్రి కొడుక్కి వారెంట్

 

కన్నడ హీరోయిన్ మైత్రేయ కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను ప్రేమించాడని, పెళ్ళి చేసుకుంటానని మోసం చేశాడని పోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే. బెంగుళూరు పోలీసులు కార్తీక గౌడ మీద కేసు నమోదు చేశారు. మామూలుగా అయితే లొంగిపోవాల్సిన కార్తీక్ గౌడ పరారీలో వున్నాడు. పరారీలో వుంటూనే బెయిల్ కోసం ప్రయత్నించాడు. బెంగుళూరు పోలీసులు కార్తీక్ గౌడ తనంతట తానే లొంగిపోతే మంచిదని సూచించారు. అరెస్టు వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం కార్తీక్- ఆగస్టు 30న సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది.కార్తీక్ గౌడ త్వరగా బెయిల్ సమకూర్చుకోని పక్షంలో పోలీసులు వేటాడి అరెస్ట్ చేసే అవకాశం వుంది.