దుర్గమ్మ అంతరాలయం కనకమయం

భక్తుల కొంగుబంగారం, భక్తుల కష్టాలు తీర్చే తల్లిగా ప్రఖ్యాతి గాంచింది బెజవాడ కనక దుర్గమ్మ. అలాంటి బంగారు తల్లికి బంగారు వాకిలిని అమర్చారు కొందరు భక్తులు. దుర్గ గుడి అంతరాలయంలో, ముఖ ద్వార తలుపులు, ద్వార బంధానికి దాతలు స్వర్ణతాపడం చేయించారు. వీటికి సుమారు రూ.కోటి రూపాయల వరకు ఖర్చు అయినట్లు అంచనా. నిన్న దేవస్థానం అధికారులు దాతలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. ఈ స్వర్ణకాంతులతో ఆలయం సరికొత్త శోభను సంతరించుకుంది. రానున్న శరన్నవరాత్రి వేడుకల్లో ఈ స్వర్ణ తాపడం ప్రత్యేక ఆకర్షణ కానుంది.