అప్పుడు క్లారిటీ ఇస్తా...

 

తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్టు కమల్ హాసన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఆపార్టీకి సంబంధించిన పార్టీ గుర్తుపై కానీ... పార్టీపై కానీ ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఇప్పుడు దీనిపై స్పష్టత ఇవ్వాలని కమల్ నిర్ణయానికి వచ్చారు. దీనిలో భాగంగానే... ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తనపై ప్రజలు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా వారికి ఏదైనా చేయాలన్న తలంపుతోనే పాలిటిక్స్ లోకి వస్తున్నానని.. ఫిబ్రవరి 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రజల సమస్యలు, వారి అవసరాలు తెలుసుకోవడమే లక్ష్యంగా సాగుతుందని అన్నారు. తన జన్మ స్థలం రామనాథపురం నుంచి మొదలుపెట్టి మదురై, దిండిగల్, శివగంగై జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందని, అప్పుడే పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపాడు. తన పర్యటన సందర్భంగా ఆ పార్టీ విధివిధానాలు కూడా స్పష్టం చేస్తానని వెల్లడించాడు.