శశికళను నిలదీసిన కమల్ హాసన్

 

శశికళ ఇంటిపై, ఆమె కుటుంబసభ్యుల ఇళ్లలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏకకాలంలో ఎన్నో చోట్ల దాడులు జరిపి కొన్ని కోట్ల విలువైన ఆస్తులను స్వాదీనం చేసుకున్నారు. ఇంకా ఐటీ అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా... ఇప్పుడు ఈ వ్యవహారంపై కమల్ హాసన్ స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, ‘ప్రభుత్వం దోపిడీలకు పాల్పడితే అది నేరం. కానీ నేరం బయటపడిన తర్వాత కూడా ఒప్పుకోకపోవడం నేరం కాదా? గంట మోగింది. ఇక క్రిమినల్‌ రాజ్యం సాగదు. ప్రజలు న్యాయమూర్తులుగా మారాలి. మేల్కోండి’ అంటూ ట్వీట్ చేశారు.