TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొనసాగుతున్న  కాళేశ్వరం కమిషన్ విచారణ 

Published on: Thu Feb 27, 2025 12:55PM

కాళేశ్వరం కమిషన్ విచారణ గురువారం నుంచి  తిరిగి ప్రారంభమైంది. గతంలో కమిషన్ ఎదుట హాజరైన వారిని కూడా  మళ్లీ విచారణ చేయాలని కమిషన్ నిర్ణయించింది.  కాగా కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా రివర్  మేనేజ్ మెంట్ బోర్డుసమావేశం కానున్నట్టు సమాచారం. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జలాల పంపిణీపై ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య  విభేధాలు తలెత్తే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి.  తెలంగాణకు 63 టిఎంసీ అవసరమని, ఆంధ్రప్రదేశ్ కు 55 టిఎంసీలు అవసరమని అభిప్రాయపడింది.  గత సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 23 టీఎంసీలకు అంగీకరించినప్పటికీ కృష్ణా రివర్ బోర్డు  సమావేశానికి ఎపి హాజరు కాకపోవడంతో మరో మారు సమావేశమయ్యే అయ్యే అవకాశాలున్నాయి.