తునిలో వందల ప్రాణాలు పోయేవా!
Published on: Mon Feb 1, 2016 4:31PM

ఒక వర్గాన్ని బి.సి.ల జాబితోకి చేర్చి రిజర్వేషన్లను కల్పించాలంటూ తునిలో జరిగిన సభ ఉద్రిక్తతలతో ముగిసింది. ఆ సభలో ఒక నాయకుడు అప్పటికప్పడు రైల్ రోకోకి పిలుపునివ్వడంతో జనం ఒక్కసారిగా రైలు పట్టాల మీదకు చేరుకున్నారు. దురదృష్టవశాత్తూ విజయవాడకి వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ అప్పుడే పట్టాల మీదకు రావడంతో ఉద్యమకారుల ఆగ్రహానికి ఆ రైలే లక్ష్యంగా నిలిచింది. బోగీల్లోకి కొందరు, రైలు పై కప్పు మీదకి కొందరు ఎగబడి దాని మీద తమ ప్రతాపాన్ని చూపసాగారు. ఈ సమయంలో రైలుని నడుపుతున్న వ్యక్తి కరెంటుని నిలిపివేయడంతో భారీ ముప్పు తప్పిందంటున్నారు నిపుణులు. లేకపోతే షార్టసర్క్యూట్ జరిగి వందలాది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని చెబుతున్నారు. వందల ఓల్టేజ్తో నడచే రత్నాచల్ ఎక్స్ ప్రెస్లో విద్యుత్ఘాతం కనుక జరిగితే జననష్టం అపారంగా ఉండేదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఉద్యమకారులకు ఆ ముందుచూపు ఎలాగూ లేకపోయింది, కనీసం రైలు నడిపే వ్యక్తికన్నా ప్రజల ప్రాణాల గురించి స్పృహ ఉండటంతో పెనుముప్పే తప్పినట్లైంది.


