వంగవీటి రాధాకు బంపరాఫర్.. పార్టీలో చేరితే వందకోట్లు!

 

వింత వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్న వంగవీటి రాధాకృష్ణకు కేఏ పాల్ బంపరాఫర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. రాధాను ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీకి అమ్ముడుపోయి తప్పు చేయవద్దన్నారు. తన తండ్రిని టీడీపీయే చంపించిందని ఆరోపణలున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరితే రాధాను కాపులు ఎన్నటికీ క్షమించబోరన్నారు. రాధా ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని, ప్రభుత్వం ఏర్పాటు చేశాక మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో తాను విఫలమైతే వంద కోట్ల రూపాయలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఈ మొత్తం డబ్బును వంగవీటి రంగా పేరుపై నడుస్తున్న ట్రస్టుకు విరాళంగా ఇస్తానన్నారు.