ఎవ‌రెస్ట్ ప‌ర్వతాన్ని ఎక్కిన మొదటి మహిళ మృతి...

 

ఎవ‌రెస్ట్ ప‌ర్వతాన్ని అధిరోహించిన తొలి మ‌హిళ జుంకో తాబి మృతిచెందారు. గత నాలుగేళ్లుగా  క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఆమె టోక్యోలోని ఓ ఆస్ప‌త్రిలో ఆమె మృతిచెందిన‌ట్లు ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు పేర్కొన్నాయి. జ‌పాన్‌కు చెందిన జుంకో తాబి 1975 మౌంట్ ఎవ‌రెస్ట్‌ను ఎక్కారు. 35 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు జుంకో ఎవరెస్ట్ ప‌ర్వ‌తాన్ని అధిరోహించారు. ఏడు ఖండాల్లో ఉన్న అత్యంత ఎత్తైన ప‌ర్వ‌తాల‌ను అధిరోహించిన మ‌హిళ‌గా కూడా ఈమెకు గుర్తింపు ఉంది.