పుట్టినరోజు వేడుకలు వద్దు: ఎన్టీఆర్

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న కావడంతో భారీ ఎత్తున వేడుకల్ని నిర్వహించడానికి ఆయన అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈసారి ఎలాంటి వేడుకల్ని చేయవద్దని ఎన్టీఆర్ తన అభిమానులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గత ఏడాది జూన్ నెలలో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.  ఈ ఘటన జరిగి ఏడాది కూడా కాలేదు. అందుకే ఎన్టీఆర్ ఈసారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయిచుకున్నారట. ‘నాన్న మమ్మల్ని విడిచి వెళ్లి ఏడాది కూడా పూర్తికాలేదు. ఇంకా ఆ విషాదం నుంచి మేము తేరుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి వేడుకలు వద్దు’ అంటూ ఎన్టీఆర్ తన అభిమానులను కోరినట్లు సమాచారం.