జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా..

 

ఈ మధ్య ప్రముఖ కంపెనీలకు జరిమానాలు పడటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ జాబితాలో మరో కంపెనీ చేరింది. ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్కు భారీ జరిమానా పడింది. వివరాల ప్రకారం... ఈ సంస్థ పౌడర్ ను వాడటం వల్ల... కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళకు అండాశయ క్యాన్సర్కు గురైనట్టు తేలడంతో సెయింట్ లూయిస్ జడ్జి ఆ మహిళకు 70 మిలియన్ డాలర్లను అంటే రూ.467కోట్లకు పైగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గత నాలుగు దశాబ్దాలుగా బాధిత మహిళ జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ ను వాడుతోందని... మూడేళ్ల క్రితం ఆమె క్యాన్సర్ కు గురైందని కోర్టు తెలిపింది. కెమోథెరపీ, రేడియేషన్, సర్జరీ ఏది చేయించుకున్నా... రానున్న రెండేళ్లలో ఆమె మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లాయర్లు తెలిపారు. ఇప్పటికే ఈ కంపెనీకి వ్యతిరేకంగా 1,700 దావాలు ఫెడరల్ కోర్టుల్లో నమోదయ్యాయి. కంపెనీ ఆఫర్ చేసే చిన్న పిల్లల ఫౌండర్, షవర్-టు-షవర్ టాల్క్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్కు కారకాలుగా నిలుస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.