మావోలకి మరో ఎదురుదెబ్బ...6గురు మృతి

 

ఈ మధ్య మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏవోబీ సరిహద్దులో కాల్పుల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఝార్ఖండ్ లో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఝార్ఖండ్‌లోని లతేహార్‌ జిల్లాలో మావోయిస్టులు, కోబ్రా బెటాలియన్‌ దళాల మధ్య బుధవారం ఉదయం భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారని.. లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా తమపై కాల్పులు జరిపారని.. దీంతో తాము ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని.. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు.