అప్పుడే రాజకీయాల్లోకి వస్తా...!

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గతకద్ది కాలంగా రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఆయన బీజేపీ చేరుతారని.. జనసేన లో చేరుతారని వచ్చిన వార్తలను ఖండించిన ఆయన.. తాను ఏ పార్టీలో చేరడం లేదని... తన భవిష్యత్తు కార్యచరణ ఏంటో త్వరలోనే చెబుతానని అన్నారు. ఇప్పుడు తాజాగా... విశాఖ వచ్చిన ఆయన సీతమ్మధారలోని వినాయక ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. అంతేకాదు... ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతానో బాగా ఆలోచించుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వచ్చే అంశంపై స్పందిస్తానని అన్నారు.