జనసేనలో చేరికపై లక్ష్మినారాయణ..

 


సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ తన పదవికి స్వచ్చంద రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కదా. రాజకీయాల్లో చేరే ఆలోచనతోనే లక్ష్మీ నారాయణ పదవికి రాజీనామా చేశారని వార్తలు కూడా. అయితే ఆయన బీజేపీలో చేరుతాడని కొందరు అనుకుంటుంటే... జనసేనలో చేరుతాడని మరికొంతమంది అనుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఈ కథనాలపై జేడీ లక్ష్మినారాయణ స్పందించారు. జనసేనలో చేరుతున్నట్టు తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని ఆయన చెప్పారు. ఇవన్నీ మీడియా సృష్టించిన కథనాలని ఆయన కొట్టిపారేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం వాస్తవమేనని.. అయితే, తన దరఖాస్తును మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని ఆయన తెలిపారు. తన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత... భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.