జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు

అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రేపు కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

బీఎస్‌3 వాహనాలను బీఎస్4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలాగే నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న అభియోగంపై అశ్విత్‌ రెడ్డిపై కేసు నమోదైంది. జూన్ 13న హైదరాబాద్‌లోని శంషాబాద్‌ లోని వారి నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కడపకు తరలించారు.