జగన్ పార్టీలోకి జేసీ కుమారుడు!!

 

 

 

'ఆంధ్రా కేజ్రివాల్ వచ్చి కాంగ్రెస్ ను ఊడ్చేయబోతున్నాడని’ చెప్పి మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో చాలా సీరియస్ చర్చకే తెరలేపారు. ఆ నలభై ఏళ్ల కుర్రాడు ఎవరై ఉంటారని ఎవరిష్టం వచ్చినట్టు వారు అభిప్రాయాలు చెబుతున్నారు. కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప వేరేవారికి సాధ్యం కాదని, కొందరు పవన్ కళ్యాణ్ అని మీడియాలో చర్చించుకుంటున్నారు.

 

కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన జేసీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే రాజీనామా చేయమని చెప్పి సంచలనం సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని, రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని తీవ్రంగా వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ తన కుమారున్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి దించుతున్నట్టుగా అనంతపూర్ లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయానికి జేసీ పవన్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ లో చేరే అవకాశముందని సమాచారం!