గవర్నర్ బతకనేర్చిన వాడు...

 

ఏ విషయాన్నైనా ముఖం మీద చెప్పే టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి ఈసారి గవర్నర్ పై విమర్సలు గుప్పించారు. గత కొద్దిరోజులుగా గవర్నర్ పై ఏపీ నేతలు అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఇటీవల జరగుతున్న రాజకీయాల నేపథ్యంలో ఏకంగా గవర్నర్ రే మార్చేద్దామని అనుకున్నారు. కానీ అది మధ్యలో ఆగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా దివాకర్ రెడ్డి గవర్నర్ పై కామెంట్లు విసిరారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ బతక నేర్చిన మనిషని ఎద్దేవ చేశారు. "నరసింహన్ గారిని నేను చాలా కాలంగా ఎరుగుదును. ఆయన చాలా సాఫ్ట్ గా ఉంటారు. కానీ బతకనేర్చిన వాడు ఆయన. ఒకే ఒక్క సెన్టెన్స్. ఆయన గవర్నర్ కాబట్టి నా బుద్ధి పుట్టినట్టుగా నేను మాట్లాడటం మంచిది కాదు. ఆయన బతకనేర్చిన వాడు. ఎప్పటికేది మాట్లాడాలో అది మాట్లాడతారు. ఆనాడు ఇందిరాగాంధీకి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి నరసింహన్ గారు. ఇవాళ ఆంధ్రదేశంలో నరేంద్ర మోదీకి ఎవరైనా దగ్గరివారంటే ఈయనే" అని అన్నారు.