మోడీ కాళ్లు పట్టుకోవాలా ఏంటీ..

 

ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా...కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటంలో టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి దిట్ట అని మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు జేసీ. ఈసారి ప్రతిపక్షంపైనో.. లేక పార్టీ నేతలపైనో జేసీ విరుచుకుపడలేదు. ఏకంగా ప్రధాని మోడీపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిధులు ఇవ్వాలనుకుంటే ఇస్తుందని అంతే తప్ప ప్రధాని కాళ్లు పట్టుకొని తెచ్చుకోవాల్సినంత ఖర్మ చంద్రబాబుకు పట్టలేదని జెసి వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబునాయుడు అంటే ఏమనుకున్నారు. ఆయన ఒక బ్రాండ్...అలాంటిది ఆయన కేంద్రానికి సాగిలపడాలా ...ఏంటి? మాకు ఆ అవసరం లేదు. ప్రధాని ఇవ్వాలనుకుంటే నిధులు ఇస్తారు..అలా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందని జెసి దివాకర్ అన్నారు. దీంతో ఇప్పుడు మోడీపైనే జేసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.